వైఎస్సార్ పింఛ‌న్ల పంపిణీకి రూ.1,547.17 కోట్లు విడుదల

Webdunia
సోమవారం, 2 మే 2022 (17:54 IST)
YSR Pension Kaanuka
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం కింద 60,87,942 మందికి పింఛ‌న్ల పంపిణీకి రూ.1,547.17 కోట్లను ఏపీ సర్కారు విడుదల చేసింది. ఏపీ వ్యాప్తంగా లబ్ధిదారులకు వైఎస్సార్ పింఛన్లను లక్షలాది మంది వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పింఛన్ల పంపిణీ రెండో రోజు కూడా కొనసాగింది. సోమవారం మధ్యాహ్నం 1:30 గంటల వరకు 77.01 శాతం పింఛన్లు పంపిణీ చేశారు. 47 లక్షల మంది లబ్ధిదారులకు మొత్తం రూ .1193.88  కోట్లు పంపిణీ చేయడం జరిగింది.
 
వైఎస్సార్ పింఛన్ల పంపిణీ కార్యక్రమం మే 1న ప్రారంభమై మే 5 వరకు కొనసాగుతుంది. పెన్షనర్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్, ఐరిస్ ఆథెంటికేషన్, రియల్ టైమ్ బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా పెన్షనర్ల ఇంటి వద్దనే వాలంటీర్లు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేస్తున్నారు.
 
రాష్ట్రంలోని అన్ని గ్రామ/ వార్డు సచివాలయాలకు ఇప్పటికే రూ.1,547.17 కోట్లు బదిలీ అయ్యాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బుడ్డి ముత్యాలనాయుడు తెలిపారు. సెలవు దినం అయినప్పటికీ ఆదివారం కూడా 60 లక్షల 80 వేల మందికి పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments