బీజేపీ కంచుకోట గోరఖ్‌పూర్ బద్ధలైంది.. కమలనాథులు నివ్వెరపోయారు

భారతీయ జనతా పార్టీ కంచుకోట గోరఖ్‌పూర్ బద్ధలైంది. దీంతో కమలనాథులు నివ్వెరపోయారు. గత మూడు దశాబ్దాలుగా కమలనాథుల చేతుల్లో ఉన్న ఈ లోక్‌సభ స్థానం ఇపుడు సమాజ్‌వాదీ పార్టీ చేతుల్లోకి వెళ్లిపోయింది.

Webdunia
గురువారం, 15 మార్చి 2018 (12:00 IST)
భారతీయ జనతా పార్టీ కంచుకోట గోరఖ్‌పూర్ బద్ధలైంది. దీంతో కమలనాథులు నివ్వెరపోయారు. గత మూడు దశాబ్దాలుగా కమలనాథుల చేతుల్లో ఉన్న ఈ లోక్‌సభ స్థానం ఇపుడు సమాజ్‌వాదీ పార్టీ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీన్ని కమలనాథులు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ఫలితంగా ఈ ఓటమికి గల కారణాలను విశ్లేషించే పనిలోపడ్డారు. 
 
ఈ స్థానం చరిత్రను ఓసారి పరిశీలిస్తే, గోరఖ్‌పూర్‌ లోక్‌స స్థానం. గోరఖ్‌నాథ్‌ మఠాధిపతి మహంత అవైద్యనాథ్‌ వరుసగా మూడుసార్లు ఇక్కడ గెలిచారు. ఆయన తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఈయన వరుసగా ఐదుసార్లు గెలుపొందారు. అంటే, దాదాపు మూడు దశాబ్దాలుగా ఇక్కడ బీజేపీదే ఆధిపత్యం. గత ఎన్నికల్లోనూ అంతకుముందు ఎన్నికల్లో కూడా యోగి ఏకంగా 3 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆయన యూపీ సీఎంగా ఎన్నికయ్యారు. దీంతో యోగి రాజీనామా చేయడంతోనే అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. 
 
గత ఎన్నికల్లో అయితే, యూపీలోని 80 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఏకంగా 73 గెలుచుకుంది. దాంతో, గోరఖ్‌పూర్‌ పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు నల్లేరుపై బండి నడకే అనుకున్నారంతా! యోగి ఆదిత్యనాథ్‌ కంచుకోటలో ఇతర పార్టీలు అడుగు పెట్టడం అసాధ్యమని భావించారు. కానీ, ఆ కంచుకోట బద్దలైంది. గోరఖ్‌పూర్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్‌ కుమార్‌ నిషాద్‌ సంచలన విజయం సాధించారు. 
 
బీజేపీ దాదాపు 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో, బీజేపీ అగ్ర నేతలు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, రాజకీయ పండితులు కూడా నివ్వెరపోయారు. గోరఖ్‌పూర్‌ పార్లమెంటు స్థానం బీజేపీ కంటే కూడా గోరఖ్‌నాథ్‌ మఠానికి చెందినది. మూడు దశాబ్దాలుగా మఠానికి చెందిన వ్యక్తులే ఇక్కడ విజయం సాధిస్తున్నారు. ఇపుడు ఆ స్థానం ఓటర్లు చరిత్రను తిరగరాశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments