Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో ప్రపంచం బిక్కుబిక్కు, కానీ చైనా మాత్రం మట్టి కోసం సరిహద్దు దాటి...

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (14:57 IST)
ప్రపంచం ఇప్పుడు కరోనావైరస్ తో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతోంది. కానీ చైనాకు మాత్రం పొరుగునే వున్న భారతదేశ సరిహద్దు దాటి లోపలికి చొచ్చుకువచ్చేందుకు ఇదే అదనని కలలు కంటోంది. ఈ క్రమంలో సరిహద్దు దాటి భారత్ భూభాగంలోకి వచ్చేందుకు యత్నించింది. దీనితో ఇరు పక్షాల మధ్య ఘర్షణ తలెత్తింది.
 
నిరంతర ఉద్రిక్తతల మధ్య ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన వాగ్వివాదంలో ఒక భారతీయ అధికారితో సహా ఇద్దరు సైనికులు అమరవీరులయ్యారు. గ్లోబల్ టైమ్స్ రిపోర్టర్ ప్రకారం, చైనాకు చెందిన ఐదుగురు చైనా సైనికులు మరణించారు. 11 మంది గాయపడ్డారు.
 
చైనాతో భారత సరిహద్దులో జరిగిన వివాదంలో 1975 తరువాత భారత సైనికులు మరణించడం ఇదే మొదటిసారి. అయితే, వాగ్వివాదంలో ముగ్గురు నుంచి నలుగురు సైనికులు మరణించారని భారత్ పేర్కొంది.
 
1975లో చైనా దాడి చేసింది: ఇరు దేశాల మధ్య చివరి కాల్పులు 1967లో జరిగాయి, కానీ 1975లో చైనా కూడా భారత సరిహద్దుపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో నలుగురు భారతీయ సైనికులు మరణించారు. ఆ సమయంలో చైనా సరిహద్దును ఉల్లంఘించిందని భారత ప్రభుత్వం చెప్పింది. కాని అప్పుడు కూడా చైనా ఈ విషయాన్ని అంగీకరించలేదు.
 
1967లో ఏమి జరిగింది: భారతదేశం మరియు చైనా మధ్య చివరి కాల్పులు 1967లో జరిగాయి. సిక్కిం ప్రాంతంలో జరిగిన ఈ హింసాత్మక ఘర్షణలో భారతదేశానికి చెందిన 80 మంది సైనికులు అమరవీరులయ్యారు. మరోవైపు, ఈ ఘర్షణలో సుమారు 400 మంది చైనా సైనికులు మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments