Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడఖ్‌లో టెన్షన్ - టెన్షన్ : ముగ్గురు భారతీయ సైనికుల మృతి

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (14:46 IST)
భారత్ - చైనా దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తలు తలెత్తాయి. నిన్నటివరకు సమస్య ముగిసిందని భావించిన తరుణంలో మళ్లీ ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా లడఖ్ ప్రాంతంలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు భారత భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన లడఖ్ గాల్వన్ లోయలో జరిగింది. చైనా సైనికుల దాడిలో ఓ అధికారితో పాటు.. ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, చైనా సైనికులు కూడా గాయపడినట్టు సమాచారం. 
 
చైనా సైనికులు హద్దుమీరిన చర్యలను భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‌తో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీడీఎస్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులను కూడా హుటాహుటిన పిలిపించారు. చైనా దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేయాలన్న దానిపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. 
 
కాగా, 1962 యుద్ధం తర్వాత సరిహద్దుల్లో అనేక ఘర్షణలు జరిగినా, ప్రాణనష్టం జరగడం ఇదే ప్రథమం. సైనికాధికారి సహా ముగ్గురు మరణించడంతో భారత్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే డ్రాగన్ కంట్రీకి తగిన గుణపాఠం చెప్పాలన్న ధోరణితో భారత్ ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments