Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్ల విజయం.. వారికి ధైర్యం?

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (22:44 IST)
న్యూయార్క్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు సాధించిన విజయంపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వీరి విజయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర తీవ్రవాద సంస్థలకు ధైర్యాన్నిచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే తాలిబన్లతో చర్చలు జరపాల్సిన అవసరమూ ఉందన్నారు. అంతర్జాతీయ సంబంధాల్లో అఫ్గాన్‌ నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు.
 
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులు పట్టు సాధిస్తున్నారని గుటెర్రస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్రికాలోని సహేల్‌ ప్రాంతంలో తీవ్రవాదుల దుశ్చర్యలను ఆయన ఉటంకించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు వారికి మరింత ధైర్యాన్నిచ్చే ప్రమాదం ఉందన్నారు.

చాలా దేశాలు ఉగ్రవాదాన్ని సమర్థంగా తిప్పికొట్టే పరిస్థితుల్లో లేవన్నారు. యావత్‌ ప్రపంచం ఏకతాటిపై నిలబడితేనే ఎదుర్కోగలమన్నారు. ఆయుధాలు చేబట్టి.. చావడానికి కూడా సిద్ధపడిన ఉన్మాదులను ఎదుర్కోవడం కష్టతరమన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments