అమ్మనీయమ్మ.. సర్వే చేస్తే.. షాక్ కొట్టిందేంటి..? వైకాపా గెలుపు ఖాయమా?

Webdunia
గురువారం, 9 మే 2019 (13:24 IST)
ఏపీ ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీన విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు ఎలా వుంటాయోనని ఆరాటం కొద్దీ నందిగామకు చెందిన ఓ టీడీపీ నేత సొంతంగా సర్వే చేయించుకున్నారని టాక్ వస్తోంది. 2019 ఎన్నకలే కాదండోయ్.. 2014లో కూడా ఇదే జరిగిందట. ఆ ఎన్నికల ఫలితాలపై జరిపిన సర్వేలో రిపోర్ట్ టీడీపీకి అనుకూలంగా వచ్చింది. 
 
ఇక తాజాగా చేయించిన సర్వేతో మాత్రం టీడీపీ నేతకు షాక్ కొట్టింది. ఈ సర్వేలో టీడీపీకి 58 సీట్లు సాధిస్తుందని రిపోర్ట్ వచ్చింది. అంతే సదరు నేత కంగారు పడ్డారని తెలిసింది. ఇందుకు కారణం అదే సర్వేలో వైసీపీకి మాగ్జిమం 105 స్థానాలు వస్తాయని తేలడమే. 
 
ఈ సర్వే రిపోర్ట్‌తో రానున్న ఫలితాలు వైకాపాకు అనుకూలంగా వుంటాయని టీడీపీ టెన్షన్ పడుతుందట. అంతటితో ఆగలేదు. ఇన్నాళ్లూ... తమకు సీట్లు తగ్గినా... జనసేన ద్వారా పొత్తు పెట్టుకొని అధికారంలోకి రావచ్చనే అంచనాల్లో ఉన్న ఆ నేత... తన సర్వే రిపోర్టులో జనసేనకు 3 సీట్లు మాత్రమే వస్తాయని తేలడంతో మరింత ఎక్కువ ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.
 
ఏపీలో మొత్తం 175 స్థానాలు ఉండగా, మ్యాజిక్ మార్కు 88. కాబట్టి ఆయనెవరో టీడీపీ నేత సర్వే ప్రకారం చూస్తే.. వైకాపాకే సానుకూల పవనాలు వీస్తున్నాయని తేలిపోయిందట. అదన్నమాట సంగతి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పంజుర్లి' హావభావాలు ప్రదర్శించి చిక్కుల్లో పడిన 'ధురంధర్' హీరో

Hrithik Roshan: ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కోసం హృతిక్ రోషన్, ర్యాన్ గాస్లింగ్ ప్రత్యేక సంభాషణ

Anandhi: గరివిడి లక్ష్మి లో కోసింది కొయగూర సాంగ్ లో ఆకట్టుకున్న ఆనంది

Kona Venkat: బ్యాండ్ మేళం నచ్చకపోతే ఇంకో సారి నా సినిమాని చూడకండి.: కోన వెంకట్

Atlee: అల్లు అర్జున్ AA22 సైన్ ఫిక్షన్ చిత్రం అప్ డేట్ తో అట్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments