వద్దులెండి... పాపం చంద్రబాబును అలా వదిలేద్దాం... ఎవరు?

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (19:10 IST)
గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 23 మంది వైకాపా ఎమ్మెల్యేలను టిడిపిలోకి లాగేశారు. ఇప్పుడు టిడిపికి 23 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. వైకాపా 151 స్థానాలు గెలుచుకుంటే కేవలం 23 సీట్లతో ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
 
అయితే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలన్నది వైకాపా నేతల ఆలోచన. దీంతో 23 మందిలో ఐదుగురు ఎమ్మెల్యేలతో చర్చలు కూడా జరిపారట వైకాపా సీనియర్ నేతలు. వారిని తమ పార్టీలోకి లాగేయాలన్న నిర్ణయానికి వచ్చేశారట. అయితే జగన్ మాత్రం అలా చేయకూడదని పార్టీ నేతలకు సూచించారట.
 
చంద్రబాబు చేసినట్లుగా మనం చేస్తే మనకు విలువ ఉండదు. మనకు ఆ ఎమ్మెల్యేలు కూడా అవసరం లేదు. చంద్రబాబును వదిలెయ్యండి అంటూ వైకాపా నేతలకు సూచించారట. ఈ విషయంపై అసెంబ్లీలో జగన్ మాట్లాడారు. జగన్ చేసిన వ్యాఖ్యలతో టిడిపి ఎమ్మెల్యేలతో పాటు చంద్రబాబు ఖంగుతిన్నారు. ఉన్న ఎమ్మెల్యేలలో కొంతమందిని లాగేసుకుంటే ఇక సభలో ప్రతిపక్షమే లేకుంటే ఎలా అన్న ఆలోచనలో పడిపోయారట చంద్రబాబు. 
 
అయితే ఇప్పుడు కాకపోయినా మరికొన్నిరోజుల్లో అయినా టిడిపికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి వైసిపి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే టిడిపి ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తే వారి వద్ద రాజీనామాలు చేయిస్తానని, ఒకవేళ రాజీనామాలు చేయకపోతే మీరే వారిపై చర్యలు తీసుకోవచ్చని కూడా స్పీకర్‌కు విన్నవించుకున్నారు జగన్మోహన్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ గ్లింప్స్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు సాన

అడివి శేష్ డెకాయిట్‌ కు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్

Samaira: కామాఖ్య నుంచి ఫ్రెండ్షిప్ మెలోడీ సఖీ సాంగ్ రిలీజ్

Adi Sai Kumar: ఆది సాయి కుమార్ కొత్త చిత్రం టైటిల్ సైరాబాను

Bellamkonda Sai : తిరుమలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి వివాహం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments