Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఆపరేషన్ బిజెపి... ఆ పార్టీ నేతలు క్యూలో ఉన్నారట..

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (18:33 IST)
తెలంగాణాలో ఆపరేషన్ ఆకర్ష్‌ని బిజెపి ప్రారంభించింది. గత కొన్నిరోజుల ముందు వరకు ఎపిలో సాగిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు తెలంగాణాను తాకింది. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్గీ లోని నేతలందరినీ బిజెపిలోకి ఆహ్వానించేస్తున్నారు. ఇప్పటికే కమలం పార్టీ హైకమాండ్‌తో పలువురు నేతలు చర్చలు జరిపారు.
 
వచ్చే ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాల్లో బలపడేందేందుకు వ్యూహరచన చేస్తోంది బిజెపి. ఇందులోభాగంగా ఇప్పటికే తెలంగాణాలో ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలుపెట్టింది. ఇప్పటికి కాంగ్రెస్ నేతలే టార్గెట్‌గా టిఆర్ఎస్ నేతలు చేస్తున్న పనితో ఆ పార్టీలో ముఖ్య నేతలే లేకుండా పోతున్నారు. ఇదే బాటలో బిజెపి కూడా తమ పార్టీ తలుపులు బార్లా తెరిచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలను పిలవడంతో కొంతమంది నేతలు అటుగా చూస్తున్నారు.
 
అంతేకాకుండా టిడిపి నేతలకు కూడా బిజెపి గాలం వేస్తోంది. దీంతో రెండు పార్టీల నుంచి వెళ్ళే వారి సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. గడిచిన రెండుమూడు రోజులుగా టి.కాంగ్రెస్, ట.టిడిపి నేతల నుంచి కొంతమంది నేతలు చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు రాంమాధవ్‌ను కలిసినట్లు సమాచారం. ఇటీవల ఓడిపోయిన ఇద్దరు, ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సిద్థంగా ఉన్నారట.
 
మరోవైపు తెలంగాణా టిడిపిలో మిగిలిన నాయకులు సైతం ఖాళీ అవుతున్నారు. ఏకంగా పార్టీ ఆఫీస్‌లనే వేదికగా చేసుకుని రాజీనామా చేసేస్తున్నామని ప్రకటించేస్తున్నారు. టిడిపి రాజ్యసభ్య సభ్యుడు ఒకరు బిజెపితో చేరుతానని సూత్రప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది. టి.టిడిపి నేతలు బిజెపి నేతలతో భేటీ కూడా అయ్యారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments