Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదుగురు మంత్రులకు జగన్ వార్నింగ్... తీరు మార్చుకోకపోతే...!!

Webdunia
ఆదివారం, 7 జులై 2019 (12:57 IST)
ఏపీ సీఎం జగన్ అంటే ఏంటో ఆచరణలో చూపిస్తున్నారు. తాను ఎలాంటి వాడినని ఆయన ప్రతి విషయంలో రుజువు చేస్తున్నారు. ఇక తాను ఏరి కోరి మంత్రులను తీసుకున్నారు. వారి పనితీరు నెల రోజులను మధింపు చేశారు. ఇక మంత్రుల పేషీలు చూస్తే జాతరను తలపిస్తున్నాయి. దీంతో ఎప్పుడూ నవ్వుతూ.. అన్నా.. అమ్మా అంటూ పిలిచే ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. 
 
కేబినెట్‌లో ఏరి కోరి తెచ్చుకున్న ఆ అయిదుగురికి సీఎం తనకు ఆగ్రహం తెప్పిస్తే ఎలా ఉంటుందో చూపించారు. తాము ఏం చేసినా ఎక్కడో క్యాంపు కార్యాలయంలో కూర్చొనే ముఖ్యమంత్రికి ఎలా తెలుస్తుందిలే అనుకున్న మంత్రులకు ఆధారాలతో సహా ఏం చేసారో వివరించారు. తాను గతంలోనే చెప్పానని..ఇప్పుడు హెచ్చరిస్తున్నానని..మరో సారి ఇదే విధంగా జరిగితే మంత్రులుగా మీరు ఉండరు అని తేల్చి చెప్పేసారు.
 
వారిలో సీనియర్ మంత్రి జగన్ చెప్పిన సమాచారంతో బిత్తర పోయారు. మిగిలిన నలుగురు బతికిపోయాం అంటూ బయటపడ్డారు. ఇంతకీ అసలు ఏం జరిగింది అంటే బదిలీలపై పెద్ద ఎత్తున పైరవీలు మంత్రుల పేషీల్లోనే జోరుగా జరిగిపోతున్నాయి. 
 
ఆ అయిదుగురు మంత్రుల బంధుగణమైతే అన్నీ తామై వ్యవహరిస్తోంది. ఈ విషయం జగన్ దృష్టికి రాగానే మండిపోయారని టాక్. మరి మంత్రులకు ఇది ఫస్ట్ వార్నింగ్. తీరు మార్చుకోకపోతే ఇంతే సంగతులేమో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments