Webdunia - Bharat's app for daily news and videos

Install App

#HistoryInToday : ప్రకృతి జల ప్రళయం సునామీకి 17 యేళ్లు

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (13:58 IST)
గత 2004లో భారీ ప్రకృతి ప్రళయం సునామీ సంభవించింది. ఈ జల ప్రళయానికి అనేక వేల మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ సహా ఏకంగా 13 దేశాల్లో తీవ్ర విషాదం నెలకొల్పింది. ఈ ప్రకృతి జల ప్రకోపానికి డిసెంబరు 26వ తేదీకి 17 సంవత్సరాలు.
 
ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో హిందూ మహాసముద్రంలో 9.15 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత సునామీ మొదలైంది. ఈ  సునామీ కారణంగా హిందూ మహాసముద్రంలోని అలలు 100 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. 
 
ఈ సునామీ తరంగాల ప్రభావం భారత్‌తో పాటు ఇండోనేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, మాల్దీవులు, మడగాస్కర్, సీషెల్స్, సోమాలియా, టాంజానియా, కెన్యా, మలేషియా తదితర దేశాల్లో విధ్వంసం సృష్టించాయి. 
 
ఈ సునామీ జల ప్రళయానికి 13 దేశాల్లో ఏకంగా 2.30 లక్షల మందిని సముద్రపు అలలు మింగేశాయి. ఒక్క ఇండోనేషియాలోనే దాదాపు 1.28 లక్షల మంది జలసమాధి అయ్యారు. భారత్‌లో 12 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోగా, 3 వేల మంది వరకు గల్లంతయ్యారు. సముద్రుడి అలల ప్రకోపానికి బంగళాలు, కార్లు, పడవలు ఇలా ఒక్కటేంటి తన దారికి అడ్డొచ్చిన సర్వనాశనమయ్యాయి. 
 
ఇండోనేషియా, శ్రీలంక దేశాల్లో దాదాపు 18 లక్షల మంది తమ ఆవాసాలను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. మరో 50 వేల మంది గల్లంతయ్యారు. 2004 డిసెంబరు 26వ తేదీని ప్రపంచంలో అత్యంత విచారకరమైన రోజుగా చరిత్రలో చెప్పుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments