Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై వేద పాఠశాల ఉపాధ్యాయుడు అత్యాచారం

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (12:53 IST)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఓ వేద పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని వాషీమ్‌లో జరిగింది. వేద పాఠాలు బోధించే ఉపాధ్యాయుడే ఈ పాడుపనికి పాల్పడటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరంలోని శ్రీ నరసింగ్ సరస్వతి స్వామి మహారాజ్ వేదపాఠశాలలో 12 యేళ్ళ బాలిక చదువుతోంది. ఈ బాలికను తన ఇంటికి పిలిచిన ఉపాధ్యాయుడు.. కాళ్లు నొప్పులుగా ఉన్నాయని.. కాస్త నొక్కాలని చెప్పాడు. దీంతో ఆ బాలిక కాళ్లు నొక్కడం ప్రారంభించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ బాలికపై ఉపాధ్యాయుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
దీంతో బోరున విలపిస్తూ ఇంటికి వచ్చిన ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... కామాంధ ఉపాధ్యాయుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments