Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబుకి మరో దెబ్బ... ప్రజావేదిక నిర్మాణ వ్యయం రాబట్టేందుకు జగన్ సర్కార్ రెడీ?

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (10:33 IST)
ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై నిర్మించిన ప్రజా వేదిక కూల్చివేత దాదాపు పూర్తి కావొచ్చింది. సుమారు 8 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి నిర్మించిన ఈ భవన సముదాయాన్ని నేలమట్టం చేసింది జగన్ ప్రభుత్వం. మొన్న కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన దరిమిలా భవనం కూల్చివేతకు దిగారు అధికారులు.
 
ఇదిలా సాగుతుండగానే ప్రజాధనంతో నిర్మించిన భవనాన్ని కూలగొట్టారు సరే... దానికైన ఖర్చును ఎవరి దగ్గర్నుంచి రాబట్టాలి.. ఇదే విషయంపై సామాజిక వేత్త పోలూరి శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రజా వేదిక భవనం అక్రమ నిర్మాణమేననీ, ఆ భవనాన్ని కూల్చివేత తక్షణం ఆపేయాలంటూ విజ్ఞప్తి చేశారు. దాన్ని కూల్చివేసే ముందు ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారి నుంచి సొమ్మును రాబట్టాలని కోరారు.

గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఆ సొమ్మును ఎవరి దగ్గర్నుంచి రాబట్టాలో ఆయనే పేర్కొన్నారు. అప్పటి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణల నుంచి డబ్బును రాబట్టాలంటూ పేర్కొన్నారు.
 
కాగా ప్రజావేదిక భవనం కూల్చివేత పనులు నిలిపివేయాలని పిటీషనర్ చేసిన అభ్యర్థనను నిరాకరించింది హైకోర్టు. ఐతే భవనాన్ని నిర్మించినందుకైన ఖర్చును రాబట్టాలన్న అంశంపైన విచారణ చేస్తామని తెలియజేసింది. కేసును రెండు వారాల పాటు వాయిదా వేసింది. ఐతే ప్రజావేదిక నిర్మాణ వ్యయం రికవరీపై ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరాం కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 
 
పర్యావరణానికి సమస్యలు తలెత్తేలా ఏమయినా నిర్మాణాలు చేపట్టి వుంటే దాన్ని తొలగించే బాధ్యత కోర్టులకు ఉందన్నారు. అలాగే ప్రజా ధనం దుర్వినియోగం ఎవరు చేశారో.. వారి వద్ద నుంచి పైకం వసూలు చేయాల్సిందేనంటూ చెప్పారు. దీన్నిబట్టి చూస్తుంటే... ప్రజావేదికకు ఖర్చయిన మొత్తాన్ని మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణల నుంచి వసూలు చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధమైనట్లేనని అనుకుంటున్నారు. ఐతే కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో మరో రెండు వారాలు వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments