Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం... ఎక్కడ?

ఠాగూర్
శుక్రవారం, 17 జనవరి 2025 (12:11 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నంలో మరో దారుణం జరిగింది. ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రైవేట్ వసతిగృహంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల కథనం మేరకు.. ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిని ఇబ్రహీంపట్నం మండలం మంగలపల్లి గేట్ వద్ద ఓ ప్రైవేట్ వసతి గృహంలో ఉంటూ సమీపంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. 
 
మంగల పల్లికి చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారికి చెందిన ఈ వసతి గృహం కింద స్థిరాస్తి ఆఫీస్ ఉండగా.. పై అంతస్తులో బాలికల వసతిగృహం ఉంది. చివరి అంతస్తులో బుధవారం రాత్రి స్థిరాస్తి వ్యాపారులకు సంబంధించి ఒకరి జన్మదిన వేడుకలు జరిగాయి. రాత్రి 11 గంటల సమయంలో అందులో పాల్గొన్న నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జోన్నాయిచింతకు చెందిన అజిత్ (22) వసతి గృహంలో ఒంటరిగా ఉంటున్న విద్యార్థిని గదిలోకి వెళ్లి అత్యాచారం చేస్తుండగా కేకలు వినిపించాయి. 
 
దీంతో పక్క గదిలోని నలుగురు విద్యార్థులు తలుపునకు గడియ పెట్టి డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అజిత్ గతంలో వసతి గృహం యజమాని వద్ద గతంలో కారు డ్రైవర్‌గా పనిచేశాడని, వసతి గృహంలో సైతం ఉండేవాడని తెలిసింది. ఈ వసతి గృహం పరిసరాలన్నీ క్షుణ్ణంగా తెలిసివుండటంతో ఈ దారుణానికి తెగబడినట్టు పోలీసులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments