Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకల దాకా మద్యం తాగి, కడుపు నిండా బిర్యానీ తిని మహిళపై అత్యాచార యత్నం చేసిన విఆర్ఎ

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (14:55 IST)
వరంగల్ జిల్లాలో ఓ కామాంధుడి చేష్టకు మహిళ భీతిల్లిపోయింది. పొట్టకూటి కోసం బిర్యానీ హోటల్ నడుపుతున్న మహిళపై కామాంధుడు విరుచుకపడ్డాడు.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఊరు శివార్లో బిర్యానీ హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ హోటల్ కి రాత్రి 9 గంటల ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన అశోక్ అనే విఆర్ఎ బిర్యానీ తినేందుకు వచ్చాడు. ఐతే అప్పటికే పూటుగా మద్యం సేవించి వున్న అశోక్, కడుపు నిండా బిర్యానీ తిని, ఆపై అశోక్ భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

 
ఆమెను సమీప పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేయబోయాడు. ఇంతలో బాధితురాలు పెద్దగా కేకలు వేయడంతో భర్త శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని అతడిని అడ్డుకున్నాడు. ఐతే తన కామాంధ కోర్కెను అడ్డుకున్న శ్రీనివాసరావు చేతి వేలు నోట్లో పెట్టుకుని కొరికేసి అశోక్ అక్కడ నుంచి పారిపోయాడు. దాంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments