Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాపిల్లలను చంపేసి... మధుర రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం..

ఠాగూర్
మంగళవారం, 12 నవంబరు 2024 (13:31 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. నగల వ్యాపారి ఒకరు తన భార్యాపిల్లను చంపేసి, ఆ తర్వాత మృతదేహాలను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. పిమ్మట తాను కూడా రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించగా, సీఆర్‌పీఎఫ్ పోలీసులు రక్షించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీకి చెందిన ముకేశ్ వర్మ అనే నగల వ్యాపారికి భార్య రేఖ, కుమార్తెలు భవ్య, కావ్య, కుమారుడు అభిష్త్ అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. నాగంతస్తుల భవనంలో సోదరులతో కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి భార్యను కత్తితో పొడిచి చంపిన ముకేశ్ వర్మ.. కుమారుడు, కుమార్తెలకు విషమిచ్చి చంపేశాడు. ఆ తర్వాత వారి ఫోటోను తీసి తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. ఆ తర్వాత మధుర ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే, రైల్వే పోలీసులు సకాలంలో స్పందించడంతో ముకేశ్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. 
 
ఇదిలావుంటే, మకేశ్ వాట్సాప్‌ చూసిన కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగువారు ఇంటికి వెళ్లి చూడగా, నాలుగు మృతదేహాలు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ తగాదాలే ఈ దారుణానికి కారణంగా చెపుతున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments