Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాపిల్లలను చంపేసి... మధుర రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం..

ఠాగూర్
మంగళవారం, 12 నవంబరు 2024 (13:31 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. నగల వ్యాపారి ఒకరు తన భార్యాపిల్లను చంపేసి, ఆ తర్వాత మృతదేహాలను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. పిమ్మట తాను కూడా రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించగా, సీఆర్‌పీఎఫ్ పోలీసులు రక్షించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీకి చెందిన ముకేశ్ వర్మ అనే నగల వ్యాపారికి భార్య రేఖ, కుమార్తెలు భవ్య, కావ్య, కుమారుడు అభిష్త్ అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. నాగంతస్తుల భవనంలో సోదరులతో కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి భార్యను కత్తితో పొడిచి చంపిన ముకేశ్ వర్మ.. కుమారుడు, కుమార్తెలకు విషమిచ్చి చంపేశాడు. ఆ తర్వాత వారి ఫోటోను తీసి తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. ఆ తర్వాత మధుర ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే, రైల్వే పోలీసులు సకాలంలో స్పందించడంతో ముకేశ్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. 
 
ఇదిలావుంటే, మకేశ్ వాట్సాప్‌ చూసిన కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగువారు ఇంటికి వెళ్లి చూడగా, నాలుగు మృతదేహాలు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ తగాదాలే ఈ దారుణానికి కారణంగా చెపుతున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments