Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ల బాలికపై ఏడేళ్ల బాలుడు అత్యాచారం... పొరుగింటి మహిళ ఫిర్యాదు

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (20:12 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహాత్ జిల్లాలో ఓ షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. ఐదేళ్ల బాలికపై ఏడేళ్ల బాలుడు అత్యాచారం చేసినట్టు సమాచారం. తన కుమార్తెను ఏడేళ్ల బాలుడు అత్యాచారం చేసినట్టు పొరుగింటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పిల్లలిద్దరికీ వైద్య పరీక్షలు చేయించగా, అత్యాచారం జరిగినట్టు తేలింది. దీంతో బాలుడిపై ఐపీసీ 376తో పాటు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
మహిళ ఇచ్చిన ఫిర్యాదులో... ఆదివారం రాత్రి తన బిడ్డ ఆడుకునేందుకు బయటకు వెళ్లిన సందర్భంలో ఈ దారుణం జరిగిందని, ఈ ఘటనపై బాలిక తల్లి అక్బర్ పూర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పిల్లలిద్దరికీ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో అత్యాచారం జరిగినట్టు తేలడంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
అయితే, ఐపీసీలోని సెక్షన్ 82 ప్రకరాం ఏడేళ్ళలోపు చిన్నారులు చేసే ఏ చర్యను అయినా నేరంగా పరిగణించరాదు. దీంతో ఈ కేసు విషయంలో పోలీసులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని అక్బర్ పూర్ పోలీసులు వెల్లడించారు. కేసులో న్యాయ నిపుణుల సూచనల మేరకు ముందుకెళతామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments