Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

ఠాగూర్
శనివారం, 28 జూన్ 2025 (08:36 IST)
ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య చేసుకుంది. మనస్పర్థల కారణంగా భర్తతో విడిపోయి తన తండ్రితో కలిసి ఉంటున్న స్వేచ్ఛ బలవన్మరణానికి పాల్పడింది. గత కొంతకాలంగా పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో తన కుమార్తెకు విభేదాలు ఉన్నాయని, ఆయన కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని స్వేచ్ఛ తండ్రి ఆరోపిస్తున్నారు. 
 
భర్తతో విడిపోయిన తర్వాత పూర్ణచంద్రరావుతో కలిసివుంటున్న తన కుమార్తె.. కొన్ని రోజుల క్రితం కూడా అతనితో కలిసి ఉండలేనని తనతో చెప్పిందన్నారు. తన కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పడం వల్లే పూర్ణచంద్రరావుతో తన కుమార్తె సహజీవనం చేస్తుందని చెప్పింది. 
 
అయితే, పెళ్లి చేసుకోవాలని పలుమార్లు ఒత్తిడి చేసినా పూర్ణ చంద్రరావు కాలయాపన చేస్తూ వచ్చాడని ఈ విషయంలోనే తన కుమార్తె తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుందని తెలిపారు. తన కుమార్తె ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని యాంకర్ స్వేచ్ఛ తండ్రి డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments