Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైన్ స్నాచింగ్‌కు పాల్పడి... మహిళ గొలుసును మింగేసిన యువకుడు..

Webdunia
సోమవారం, 29 మే 2023 (09:58 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ యువకుడు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆ గొలుసును మింగేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో సల్మాన్, జాఫర్ అనే ఇద్దరు యువకులు దొంగతనాలకు పాల్పడేవారు. వీరిద్దరూ దిబిహ్ వంతెన సమీపంలో రోడ్డు మీద వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాగేశారు. 
 
దీంతో బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో పక్కనే ఉన్న పోలీసులు ఆ కేకలు విని... బైక్ మీద పారిపోతున్న దొంగలను కిలోమీటరు దూరం వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. తాము దొంగతనం చేయలేదని తప్పించుకునేందుకు సల్మాన్ చోరీ చేసిన బంగారు గొలుసును మింగేశాడు. 
 
వెంటనే అతణ్ని రాంచీ లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి స్కానింగ్ చేయగా, నిందితుడి ఛాతీ భాగంలో బంగారు గొలుసు ఇరుక్కుపోయినట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఆ గొలుసు ఎక్కువ సేపు ఉంటే ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో ఆపరేషన్ చేసి వెలికి తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments