Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.1.2 కోట్లతో పారిపోయిన డ్రైవర్.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 29 మే 2023 (09:41 IST)
హైదరాబాద్ నగరంలో ఓ నిర్మాణ సంస్థ డ్రైవర్ రూ.1.2 కోట్ల నగదుతో పారిపోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లోని ఆదిత్రి హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో ఖమ్మం జిల్లా కల్లూరు వాసి బానోతు సాయికుమార్‌ మాదాపూర్‌లో ఉంటూ మూడేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
 
సంస్థ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రావు ఈనెల 24వ తేదీన ఉదయం 8.30 గంటలకు రూ.1.2 కోట్లను జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఇవ్వాల్సిందిగా సూచించారు. సాయికుమార్‌ కార్యాలయ వాహనం ఇన్నోవా (టీఎస్‌08హెచ్‌పీ9788)లో డబ్బుతో బయలుదేరాడు. 
 
కొంతదూరం వెళ్లిన తర్వాత అక్కడ కారు వదిలేసి నగదుతో పరారయ్యాడు. డబ్బు ఇంట్లో ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీనివాస్‌ రావు..  డ్రైవర్‌కు ఫోన్‌ చేయగా కలవలేదు. దీంతో ఏజీఎం షేక్‌ జిలానీ అదేరోజు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని ఆదివారం రాజమండ్రిలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments