అన్నా నేను చనిపోతున్నా.. ఇదే నా చివరి కాల్.. ఇక నేను కలవను...

Webdunia
సోమవారం, 29 మే 2023 (09:37 IST)
అన్నా.. నేను చనిపోతున్నా.. ఇదే నా చివరి కాల్‌.. ఇక నేను కలవను.. క్షమించండంటూ ఓ యువకుడు తన సోదరుడికి ఫోన్‌ చేసి రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడటం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ విషాదకర ఘటన జరిగింది. 
 
పోలీసుల కథనం మేరకు.. కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌కు చెందిన కేదరిశెట్టి శివసాయి గణేశ్‌ (22) తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి నుంచి కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌కు సుమారు కరోనా మొదటి లాక్‌డౌన్‌ సమయంలో కుటుంబంతో వచ్చాడు.
 
స్థానికంగా మిర్చిబజ్జీ బండి నడిపిస్తున్నాడు. ఇతని సోదరుడు మణికంఠ కూడా మాదాపూర్‌లో అదే వ్యాపారం చేస్తున్నాడు. అంతా కలిసే ఉంటారు. శనివారం మణికంఠ పుట్టినరోజు కావడంతో స్నేహితులతో బయట ఉన్న సమయంలో రాత్రి 10.24 గంటలకు శివసాయి గణేశ్‌ ఫోన్‌ చేసి చనిపోతున్నా.. అని చెప్పగా ఏం జరిగిందని మణికంఠ అంటుండగానే ఫోన్‌ ఆపేశాడు.
 
వెంటనే ఇంటికి చేరుకున్న మణికంఠ విషయం చెప్పి సమీపంలోని హైటెక్‌ సిటీ ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్‌ చుట్టుపక్కల వాకబు చేసే క్రమంలో శివసాయిగణేశ్‌ రైలు కింద పడి మృతిచెందివుండటాన్ని గుర్తించాడు. తన పుట్టినరోజునే సోదరుడు విగతజీవిగా మారడం చూసి బోరుమన్నాడు. 
 
ఆర్థిక సమస్యలు తమతో పంచుకోకుండా ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు విలపించారు. శవపరీక్ష అనంతరం రైల్వే పోలీసులు మృతదేహాన్ని అప్పగించడంతో ఆదివారం అంత్యక్రియలు పూర్తిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments