Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు పుట్టిస్తా అంటూ మూడు రాత్రులు వివాహితపై అత్యాచారం చేసిన మంత్రగాడు

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (18:11 IST)
ప్రేమించిన వ్యక్తినే పెళ్ళి చేసుకుంది. అయితే పిల్లలు పుట్టలేదు. 8 సంవత్సరాలు అవుతున్నా పిల్లలు పుట్టకపోవడంతో భర్త ఒక స్వామీజి దగ్గరకు తీసుకెళ్ళాడు. అయితే ఆ స్వామీజీ మంత్రాలంటూ ఆమెను మూడురోజుల పాటు లొంగదీసుకున్నాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
 
గుజరాత్ లోని అహ్మదాబాద్ సమీపంలో రెహమాన్, రేష్మాలు నివాసముంటున్నారు. వీరికి 8 సంవత్సరాల క్రితం వివాహమైంది. ప్రేమించి పెద్దలను ఎదిరించి మరీ వీరు వివాహం చేసుకున్నారు. అయితే పిల్లలు పుట్టకపోవడంతో ఇంట్లోని పెద్దవారు సూటిపోటి మాటలను అనేవారు.
 
దీంతో మనస్థాపంతో ఇద్దరూ కలిసి ఇంతియాజ్ అనే మాంత్రికుడి దగ్గరకు వెళ్ళారు. వారంరోజుల పాటు పూజలు చేసి మంత్రాన్ని జపిస్తే పిల్లలు పుడతారని చెప్పాడు మంత్రగాడు. నిజమేనని నమ్మిన వారిద్దరు పూజలు చేశారు. కానీ పూజ సమయంలో మత్తు మందు ఇచ్చి మూడురోజుల పాటు రేష్మాపై అత్యాచారం చేశాడు ఇంతియాజ్. 
 
అయితే ఆలస్యంగా విషయాన్ని తెలుసుకున్న బాధితురాలు తన భర్తకు విషయాన్ని చెప్పింది. దీంతో స్వామీజీని స్థానికులతో కలిసి చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. నిందితుడు గతంలో ఇదేవిధంగా చాలామంది మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments