Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు వెంకటాచలంలో ఘోర ప్రమాదం: కారుతో సహా సజీవ దహనమైన వ్యక్తి

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (20:09 IST)
నూతన సంవత్సరం వేళ నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఘోరం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కారుతో సహా సజీవ దహనమయ్యాడు. వెంకటాచలం గొలగమూడి రైల్వే గేటుకి సమీపంలో కారు మంటల్లో మండుతుండటంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక దళాన్ని రంగంలోకి దింపి మంటలను ఆర్పేశారు. ఐతే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. అందులో ఓ వ్యక్తి కూడా సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదానికి కారణం ఏమిటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 
ఎవరైనా దుండగులు వ్యక్తిని హత్య చేసి కారుతో సహా నిప్పంటించారా లేదంటే ఆ వ్యక్తే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయిన వ్యక్తిది నెల్లూరు అని గుర్తించారు. దీనితో అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments