Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌కు భారత్ సాయం : 5 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసుల‌ు తరలింపు

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (19:57 IST)
ఆప్ఘనిస్థాన్‌కు భారత్ సాయం చేసింది. క‌రోనా స‌మ‌యంలో భార‌త్ అనేక దేశాల‌కు మాన‌వ‌తా దృక్ప‌దంలో స‌హాయం చేసింది. అమెరికాతో స‌హా అనేక దేశాల‌కు మందుల‌ను స‌ప్లై చేసింది. తాజాగా తాలిబ‌న్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న ఆప్ఘనిస్థాన్‌కు కూడా సాయం అందించింది. 
 
ఇటీవ‌లే ఇండియా నుంచి గోధుమ‌ల‌ను కూడా ఆఫ్ఘ‌నిస్తాన్‌కు ఉచితంగా ఎగుమ‌తి చేసింది. అదే విధంగా ఇప్పుడు 5 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసుల‌ను ఆఫ్ఘ‌న్‌కు అందించింది.  శనివారం ఉద‌యం ఇండియా నుంచి స్పెష‌ల్ విమానంలో ఈ వ్యాక్సిన్‌ల‌ను కాబూల్‌కు చేర్చారు.  కాబూల్‌లోని ఇందిరాగాంధీ ఆసుప‌త్రికి ఈ వాక్సిన్ డోసుల‌ను త‌ర‌లిస్తున్నారు. 
 
కేవలం వ్యాక్సిన్ డోసులను మాత్రమే కాకుండా.. ఆఫ్ఘన్ ప్రజలకు ఆహార ధాన్యాలు మరియు అవసరమైన ప్రాణాలను రక్షించే మందులను కూడిన అందించడానికి భారతదేశం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
"గత నెలలో 1.6 టన్నుల మెడికల్ ఎక్విప్ మెంట్ పంపించాం. రాబోయే వారాల్లో గోధుమల సరఫరా మరియు మిగిలిన వైద్య సహాయాన్ని చేపట్టనున్నాం. ఈ విషయంలో రవాణాకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడానికి ఐక్యరాజ్యసమితితో సంప్రదింపులు జరుపుతున్నాం" అని తెలిపింది.

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments