Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌కు భారత్ సాయం : 5 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసుల‌ు తరలింపు

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (19:57 IST)
ఆప్ఘనిస్థాన్‌కు భారత్ సాయం చేసింది. క‌రోనా స‌మ‌యంలో భార‌త్ అనేక దేశాల‌కు మాన‌వ‌తా దృక్ప‌దంలో స‌హాయం చేసింది. అమెరికాతో స‌హా అనేక దేశాల‌కు మందుల‌ను స‌ప్లై చేసింది. తాజాగా తాలిబ‌న్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న ఆప్ఘనిస్థాన్‌కు కూడా సాయం అందించింది. 
 
ఇటీవ‌లే ఇండియా నుంచి గోధుమ‌ల‌ను కూడా ఆఫ్ఘ‌నిస్తాన్‌కు ఉచితంగా ఎగుమ‌తి చేసింది. అదే విధంగా ఇప్పుడు 5 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసుల‌ను ఆఫ్ఘ‌న్‌కు అందించింది.  శనివారం ఉద‌యం ఇండియా నుంచి స్పెష‌ల్ విమానంలో ఈ వ్యాక్సిన్‌ల‌ను కాబూల్‌కు చేర్చారు.  కాబూల్‌లోని ఇందిరాగాంధీ ఆసుప‌త్రికి ఈ వాక్సిన్ డోసుల‌ను త‌ర‌లిస్తున్నారు. 
 
కేవలం వ్యాక్సిన్ డోసులను మాత్రమే కాకుండా.. ఆఫ్ఘన్ ప్రజలకు ఆహార ధాన్యాలు మరియు అవసరమైన ప్రాణాలను రక్షించే మందులను కూడిన అందించడానికి భారతదేశం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
"గత నెలలో 1.6 టన్నుల మెడికల్ ఎక్విప్ మెంట్ పంపించాం. రాబోయే వారాల్లో గోధుమల సరఫరా మరియు మిగిలిన వైద్య సహాయాన్ని చేపట్టనున్నాం. ఈ విషయంలో రవాణాకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడానికి ఐక్యరాజ్యసమితితో సంప్రదింపులు జరుపుతున్నాం" అని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments