Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌కు భారత్ సాయం : 5 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసుల‌ు తరలింపు

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (19:57 IST)
ఆప్ఘనిస్థాన్‌కు భారత్ సాయం చేసింది. క‌రోనా స‌మ‌యంలో భార‌త్ అనేక దేశాల‌కు మాన‌వ‌తా దృక్ప‌దంలో స‌హాయం చేసింది. అమెరికాతో స‌హా అనేక దేశాల‌కు మందుల‌ను స‌ప్లై చేసింది. తాజాగా తాలిబ‌న్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న ఆప్ఘనిస్థాన్‌కు కూడా సాయం అందించింది. 
 
ఇటీవ‌లే ఇండియా నుంచి గోధుమ‌ల‌ను కూడా ఆఫ్ఘ‌నిస్తాన్‌కు ఉచితంగా ఎగుమ‌తి చేసింది. అదే విధంగా ఇప్పుడు 5 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసుల‌ను ఆఫ్ఘ‌న్‌కు అందించింది.  శనివారం ఉద‌యం ఇండియా నుంచి స్పెష‌ల్ విమానంలో ఈ వ్యాక్సిన్‌ల‌ను కాబూల్‌కు చేర్చారు.  కాబూల్‌లోని ఇందిరాగాంధీ ఆసుప‌త్రికి ఈ వాక్సిన్ డోసుల‌ను త‌ర‌లిస్తున్నారు. 
 
కేవలం వ్యాక్సిన్ డోసులను మాత్రమే కాకుండా.. ఆఫ్ఘన్ ప్రజలకు ఆహార ధాన్యాలు మరియు అవసరమైన ప్రాణాలను రక్షించే మందులను కూడిన అందించడానికి భారతదేశం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
"గత నెలలో 1.6 టన్నుల మెడికల్ ఎక్విప్ మెంట్ పంపించాం. రాబోయే వారాల్లో గోధుమల సరఫరా మరియు మిగిలిన వైద్య సహాయాన్ని చేపట్టనున్నాం. ఈ విషయంలో రవాణాకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడానికి ఐక్యరాజ్యసమితితో సంప్రదింపులు జరుపుతున్నాం" అని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments