Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...

ఠాగూర్
సోమవారం, 2 జూన్ 2025 (08:56 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలోని జగదేవ్‌పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో ఓ విషాదకర ఘటన జరిగింది. తాను అడిగిన బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదన్న కోపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసే స్థోమత లేదని చెప్పినప్పటికీ ఆ యువకుడు పట్టించుకోలేదు కదా.. తీవ్ర మనస్థాపానికిలోనై... పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చాట్లపల్లి గ్రామానికి చెందిన కనకయ్య కుమారుడు జానీ (21) కొద్ది రోజుల క్రితం బీఎండబ్ల్యూ కారు కావాలని తండ్రిని అడిగాడు. అయితే, అంత డబ్బు తన వద్ద లేదని, బీఎండబ్ల్యూకు బదులుగా స్విఫ్ట్ కారు కొనిస్తానని కనకయ్య చెప్పాడు. ఆ తర్వాత సిద్ధిపేటలోని ఓ కార్ల షోరూమ్‌కు తన కుమారుడుతో కలిసి వెళ్లిన కనకయ్య... స్విఫ్ట్ కారును చూపించాడు. అయితే, ఆ కారు నచ్చకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చేశాడు. 
 
ఈ క్రమంలో తాను కోరుకున్న కారు కొనివ్వలేదన్న మనస్తాపంతో జానీ పురుగుల మందు సేవించాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ములుగులోని ఆర్‌వీఎం ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments