బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...

ఠాగూర్
సోమవారం, 2 జూన్ 2025 (08:56 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలోని జగదేవ్‌పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో ఓ విషాదకర ఘటన జరిగింది. తాను అడిగిన బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదన్న కోపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసే స్థోమత లేదని చెప్పినప్పటికీ ఆ యువకుడు పట్టించుకోలేదు కదా.. తీవ్ర మనస్థాపానికిలోనై... పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చాట్లపల్లి గ్రామానికి చెందిన కనకయ్య కుమారుడు జానీ (21) కొద్ది రోజుల క్రితం బీఎండబ్ల్యూ కారు కావాలని తండ్రిని అడిగాడు. అయితే, అంత డబ్బు తన వద్ద లేదని, బీఎండబ్ల్యూకు బదులుగా స్విఫ్ట్ కారు కొనిస్తానని కనకయ్య చెప్పాడు. ఆ తర్వాత సిద్ధిపేటలోని ఓ కార్ల షోరూమ్‌కు తన కుమారుడుతో కలిసి వెళ్లిన కనకయ్య... స్విఫ్ట్ కారును చూపించాడు. అయితే, ఆ కారు నచ్చకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చేశాడు. 
 
ఈ క్రమంలో తాను కోరుకున్న కారు కొనివ్వలేదన్న మనస్తాపంతో జానీ పురుగుల మందు సేవించాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ములుగులోని ఆర్‌వీఎం ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్ నిడిమోరు

Kandula Durgesh: ఏపీలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ, త్వరలో నంది అవార్లులు : కందుల దుర్గేష్

Ram Achanta : అఖండ 2 నిర్మించడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాం : రామ్, గోపీచంద్ ఆచంట

Bhumika Chawla: యూత్ డ్రగ్స్ మహమ్మారి బ్యాక్ డ్రాప్ తో యుఫోరియా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments