Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

Advertiesment
Raja singh

సెల్వి

, శనివారం, 31 మే 2025 (09:47 IST)
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా బీజేపీ ప్రస్తుత, మాజీ అధ్యక్షులపై షాకింగ్ ఆరోపణలు చేశారు ఆయన. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో ఆయనకు విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా బీజేపీలో ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారని రాజా సింగ్ అన్నారు. కరీంనగర్ నుంచి తనపై వార్ స్టార్ట్ అయ్యిందని రాజాసింగ్ ఆరోపించారు. 
 
పరోక్షంగా ఆయన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ని టార్గెట్ చేసిన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ నేత కవిత చేసిన వ్యాఖ్యలను సమర్థించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీలో బీఆర్‌ఎస్ పార్టీ విలీనమంటూ కవిత చెప్పిన మాటలు నిజమేనేమో అని అన్నారు. పెద్ద ప్యాకేజీ దొరకితే తమ వాళ్లు ఎప్పుడో బీఆర్‌ఎస్‌తో కలిసిపోయేవారని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వికసిత్ భారత్ నిర్మాణం: ఆప్టిగల్ ప్రైమ్, ఆప్టిగల్ పినాకిల్‌ను ప్రవేశపెట్టిన ఎఎం-ఎన్ఎస్ ఇండియా