Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఠాగూర్
సోమవారం, 2 డిశెంబరు 2024 (17:25 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. తల్లిదండ్రులు చేసిన పెళ్లిని తెగదెంపులు చేసుకుని మరో పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్  ఉద్యోగం చేసే అక్కను సోదరుడు కడతేర్చాడు. డ్యూటికి వెళుతున్న కానిస్టేబుల్ నాగమణిని కారుతో ఢీకొట్టించి ఆపై వేట కొడవలితో దాడి చేశాడు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాయపోలుకు చెందిన నాగమణి అనే మహిళా కానిస్టేబుల్.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు గతంలో వివాహం కాగా, పది నెలల క్రితం విడాకులు తీసుకుంది. 
 
నెల రోజుల తర్వాత కులాంతర వివాహం చేసుకుంది. ఈ వివాహంతో తమ కుటుంబ పరువు పోయిందని నాగమణి సోదరుడు ఆవేశంతో ఊగిపోయాడు. అక్కపై కక్ష పెంచుకున్న సోదరుడు.. నాగమణి డ్యూటీకి వెళఅలే సమయంలో కారుతో ఢీకొట్టించడంతో కిందపడిపోయాడు. 
 
ఆ తర్వాత వేటకొడవలితో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. జనమంతా చూస్తుండగానే ఈ ఘోరానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన నాగమణి అక్కడికక్కడే చనిపోయింది. ఈ హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నాగమణి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments