Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికతో స్నేహం.. బెదిరించి న్యూడ్ వీడియోలు తీసి ఫ్రెండ్స్‌కు షేరింగ్...

ఠాగూర్
సోమవారం, 23 జూన్ 2025 (14:12 IST)
తెలంగాణా రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో జరిగిన ఓ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్నేహం పేరుతో 16 యేళ్ల బాలికతో పరిచయం పెంచుకున్న 16 యేళ్ళ బాలుడు.. ఆ బాలికను బెదిరించి న్యూడ్‌గా వీడియోలు తీశాడు. ఆ వీడియోలను తన స్నేహితులకు పంపించాడు. ఈ వీడియోలు స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో ఈ దుశ్చర్య వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇద్దరు మైనర్లతో సహా ఆరుగురిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు...మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు సామాజిక మాధ్యమం ద్వారా ఓ బాలుడు దగ్గరయ్యాడు. నగ్నంగా వీడియో కాల్ చేయాలని, లేదంటే తనతో చేసిన చాటింగ్‌ను తల్లిదండ్రులకు చూపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో భయపడిపోయిన ఆ బాలిక దుస్తులిప్పేసి వీడియో కాల్ చేసింది. ఈ వీడియోను మైనర్ బాలుడు రికార్డు చేసి తన స్నేహితులకు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. 
 
ఆ తర్వాత ఆ బాలికను పలుమార్లు మానసికంగా, శారీరకంగా వేధించసాగాడు. అదేసమయంలో ఈ వీడియోలు వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన షీటీం బృందం సహాయంతో గుడిహత్నూర్, ఇచ్చోడ పోలీసుసలు బాలుడు (16), వంశీకృష్ణ (20), పవర్ తరుణ్ (18), బాలవంత్ సింగ్ (18), గుండల్వార్ వరుణ్ (18), కారడ్ సుధీర్ (28), ముర్కుటే విఠల్ (23)లను అరెస్టు చేశారు. వీరిని న్యాయమూర్తి ముందు హాజరుపరచగా ఇద్దరు బాలురను నిజామాబాద్ జువైనల్ హోంకు, మిగిలినవారిని జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments