Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెకు 28.. అతడికి 20.. బండరాయితో మోది చంపేశారు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 1 మే 2023 (09:37 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ జంట దారుణ హత్యకు గురైంది. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ జంట హత్య కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని గుడిహత్నూర్‌ మండలంలోని సీతాగోంది శివారులో రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అవి ఆదిలాబాద్‌ పట్టణం భుక్తాపూర్‌కు చెందిన రెహమాన్‌(20), కేఆర్‌కే నగర్‌కు చెందిన అశ్విని(28)గా గుర్తించారు. అశ్వినికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసింది. కొన్ని నెలలుగా భర్తతో విడిపోయి పుట్టింట్లో ఉంటుంది. 
 
ఈ క్రమంలో ఆమెకు రెహమాన్‌తో వివాహేతర సంబంధం ఉండడం వల్లే ఈ హత్యలు జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వీరిద్దరూ శుక్రవారం ఆదిలాబాద్‌ నుంచి సీతాగోందిలో స్థానిక పంట పొలంలోకి ద్విచక్రవాహనంపై వెళ్తున్న సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. వారు మృతదేహాలను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. వారిద్దరి తలలపై బండరాళ్లతో మోది కిరాతకంగా హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. 
 
ఈ హత్యలు అశ్విని భర్త తరపు వాళ్లే చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. శవ పరీక్ష కోసం మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు. ప్రాథమిక విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ నాగేందర్‌ తెలిపారు. ఘటన స్థలాన్ని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సందర్శించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments