Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోర్ బెల్ కొట్టి ఆట పట్టించారనీ ముగ్గురు టీనేజరల్ హత్య.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 1 మే 2023 (09:23 IST)
ఆ ముగ్గురు టీనేజర్లు. పక్క ఇంటి డోర్ బెల్ కొట్టి కొద్దిసేపు ఆటపట్టించారు. దీంతో పక్కింటి వ్యక్తి ఆ ముగ్గురు టీనేజర్లను దారుణంగా హత్య చేశారు. ఈ దారుణం అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కొందరు టీనేజర్లు తన ఇంటి డోర్‌బెల్‌ను మోగించి ఆటపట్టించారని, ఆ సమయంలో తాను మద్యం మత్తులో ఉన్నానని.. తన కుటుంబ సభ్యుల భద్రత గురించి భయపడ్డానని చంద్ర విచారణలో తెలిపాడు. వారు తన వెనుక భాగంపై చరిచి కారులో పారిపోవడానికి యత్నించారని, వారిని నిలదీసేందుకు తన కారులో వారిలో అనుసరించానని.. ఈక్రమంలోనే అనుకోకుండా తన కారు వారి వాహనాన్ని ఢీకొట్టిందని పేర్కొన్నాడు. 
 
ఈ ఘటనలో వారి వాహనం చెట్టుకు ఢీకొనడంతో ముగ్గురు కుర్రాళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో చంద్రకు పెరోల్‌ అవకాశం లేకుండా యావజ్జీవ శిక్ష పడొచ్చని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటన 2020 జనవరి 19వ తేదీన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి నమోదైన కేసులో రివర్‌సైడ్‌ కౌంటీ నివాసి అనురాగ్‌ చంద్రను న్యాయస్థానం దోషిగా తేల్చింది.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments