Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించలేదని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు ... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (19:04 IST)
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో దారుణం జరిగింది. తనను ప్రేమించలేదన్న అక్కసుతో ఒక యువతిని యువకుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణ ఘటన బెంగూళూరు శివారుల్లోని ఓ ప్రైవేటు యూనివర్శిటీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
లయ స్మిత అనే 19 యేళ్ల యువతి కాలేజీలో బీటెక్ విద్యాభ్యాసం చేస్తుంది. అలాగే, పవన్ కళ్యాణ్ అనే 21 యేళ్ల యువకుడు బీసీఏ చదువుతున్నాడు. వీరిద్దరిదీ ఒకే ఊరు కావడంతో గత కొంతకాలంగా వీరిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు. పైగా, బంధుత్వం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆమెను పెళ్లి చేసుకోవాలని పవన్ భావించాడు. ఇందుకు స్మిత అంగీకరించలేదు. పైగా, ఆ యువతి కుటుంబం కూడా ససేమిరా అన్నారు. తన కుమార్తెపై ఆశలు పెట్టుకోవద్దని పవన్‌కు హెచ్చరించారు. 
 
ఈ నేపథ్యంలో స్మితపై కక్ష పెంచుకున్న పవన్... ఆమెను చంపాలన్న నిర్ణయానికి వచ్చి, ఆమె చదువుతున్న కాలేజీకి వెళ్లి అక్కడ కొద్దిసేవు ఆమెతో మాట్లాడారు. ఈ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వివాదం కూడా జరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన పవన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడవడంతో ఆమె అక్కడే రక్తపు మడుగులో పడిపోయింది. ఆ తర్వాత పవన్ కూడా అదే కత్తి తనకు తాను పొడుచుకున్నాడు. వీరిద్దరినీ ఆస్పత్రికి తరలించగా, స్మిత మరణించినట్టు వైద్యులు నిర్ధారించగా, పవన్‌కు చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments