Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాక్రా కాలువలో 22 యేళ్ల ట్రైనీ ఎయిర్‌హోస్టెస్ నిషా మృతదేహం (Video)

ఠాగూర్
శుక్రవారం, 24 జనవరి 2025 (08:16 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి జిల్లా సెరు గ్రామానికి చెందిన 22 యేళ్ల ఎయిర్‌హోస్టెస్ ట్రైనీ నిషా హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా సమీపంలో ఉన్న భాక్రా కాలువలో స్వాధీనం చేసుకున్నారు. ఆమెను 33 యేళ్ల పోలీస్ అధికారి హత్య చేశారు. అతని పేరు యువరాజ్. మొహాలీలో విధులు నిర్వహిస్తున్న యువరాజ్... నిషాను హత్య చేసి మృతదేహాన్ని భాక్రా కాలువలో పడేశాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 27వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. 
 
పోలీసు ల కథనం మేరకు... నిషా, యువరాజ్‌లు మంచి స్నేహితులు. గత మూడేళ్లుగా నిషా చండీగఢ్‌లో ఉంటూ ఎయిర్ హోస్టెస్‌గా శిక్షణ పొందుతోంది. సెరు గ్రామంలోని తన ఇంటికి వెళ్లిన ఆమె సోమవారం తిరిగి చండీగఢ్‌కు వచ్చింది. జనవరి 20 సాయంత్రం, నిషా, యువరాజ్ చండీగఢ్‌లోని ఆమె పేయింగ్ గెస్ట్ వసతి నుండి బయలుదేరారు. తర్వాత నిషా ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబసభ్యులు పలుమార్లు ప్రయత్నించినా ఆమెను సంప్రదించలేకపోయారు. 
 
దీంతో ఆమె కుటుంబ సభ్యులు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 21న ఆమె మృతదేహం భాక్రా కెనాల్‌లో పాక్షికంగా దుస్తులు ధరించి కనిపించింది. జనవరి 22న, మహిళను గుర్తించేందుకు ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న యువరాజ్‌పై హత్య కేసు నమోదైంది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments