Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.150 కోసం బండరాయితో కొట్టి చంపేశారు... సైకో మృత్యుకేళి

Webdunia
గురువారం, 11 మే 2023 (09:59 IST)
పల్నాడు జిల్లా నరసారావు పేటలో జంట హత్యలు చోటుచేసుకున్నాయి. ఇవి స్థానికంగా కలకలం సృష్టించాయి. ఈ జంట హత్యల్లో మృతులిద్దరినీ కేవలం రూ.150 కోసం బండరాయితో కొట్టి చంపేశారు. నరసారావు పేట రైల్వే స్టేషన్ రోడ్డులో ఈ జంట హత్యలు జరిగాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రైల్వే స్టేషన్ రోడ్డులో మృతి చెందిన ఇద్దరు మద్యం సేవించి మరణించివుంటారని భావించారు. అయితే, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి రంగంలోకి దిగి స్థానికంగా ఉండే సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించగా, అవి హత్యలుగా తేలింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు.. అసలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జిల్పా ఎస్పీ పర్యవేక్షణలో జంట హత్యలు జరిగిన కొన్ని గంటల్లోనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
 
ఈ హత్యలకు పాల్పడింది. తన్నీరు అంకమ్మరావుగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన అంకమ్మరావు గత జూన్ నలలో నగదు కోసం ఓ మహిళను హతమార్చిన కేసులో అరెస్టయ్యాడు. సాక్ష్యాధారాలు లేక పోవడంతో మార్చిలో జైలు నుంచి బయటకువచ్చాడు. 
 
అలాగే, బుధవారం తెల్లవారుజామున రైల్వేస్టేషన్ రోడ్డులో పడుకుని ఉన్న తెలంగాణలోని మహబూబాబాద్‌కు చెందిన సంతోష్ రెడ్డి (45)ని బండ రాయితో మోది హతమార్చి అతని వద్ద ఉన్న రూ.30 దోసుకున్నాడు. 
 
ఆ తర్వాత సమీపంలోనే మరో గుర్తు తెలియని వ్యక్తిని కూడా ఇదే తరహాలో చంపి అతని వద్ద ఉన్న రూ.120 తీసుకున్నాడు. కాగా, విచారణ సమయంలో ఈ నెల 5న మార్కెట్ సెంటరులో 400 కోసం ఓ మహిళను హతమార్చినట్లు ఈ సైకో కిల్లర్ అంగీకరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments