Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగతనం కేసు పెట్టేందుకు వెళితే అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు!!

ఠాగూర్
బుధవారం, 28 ఆగస్టు 2024 (11:54 IST)
తమ ఇంట్లో పని చేసే పనిమనిషిపై దొంగతనం కేసు పెట్టేందుకు వెళ్లిన ఓ నగల వ్యాపారిపై మహారాష్ట్ర రాజధాని ముంబై నగర పోలీసులు తేరుకోలేని షాకిచ్చారు. ఆయనపై అత్యాచారం కేసు నమోదు చేశారు. ఈ షాకింగ్ సంఘటన ముంబైలో వెలుగు చూసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
55 యేళ్ళ స్థానిక నగల వ్యాపారి ఒకరు తన ఇంట్లో పని చేస్తున్న 27 యేళ్ల మహిళ రూ.15 వేల నగదు చోరీ చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, తాను చోరీ చేసినట్టు తొలుత అంగీకరించిన ఆ పనిమనిషి.. తనపై యజమాని పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ యేడాది ఫిబ్రవరి నుంచి నగల వ్యాపారి ఇంట్లో పని చేస్తున్నానని, తాను ఒంటరిగా ఉన్న సమయంలో అతడు వేధింపులకు పాల్పడేవాడని ఆమె ఆరోపించారు. 
 
అతడి భార్య ఇంట్లో లేని సమయంలో తనను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు వెల్లడించారు. జరిగిన విషయాన్ని బయటపెడితే తన భర్తను, బిడ్డను చంపేస్తానని బెదిరించాడని ఆరోపించారు. పైగా, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడానికి డబ్బులు కూడా ఇవ్వజపాడని, అయితే, వాటిని తాను తీసుకోలేదని చెప్పారు. దీంతో పోలీసులు ఆ పనిమనిషిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించి, నగల వ్యాపారిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

రామ్ పోతినేని తన ప్రేయసికి అనుభవంలోంచి నువ్వుంటే చాలే.. గీతం రాశారా !

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments