Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అత్యాచారం అంటే ఏంటి అత్తా? రెండు రోజుల తర్వాత బాలికపై అత్యాచారం!

victim woman

ఠాగూర్

, మంగళవారం, 27 ఆగస్టు 2024 (14:31 IST)
అత్యాచారం అంటే ఏమిటో తెలియని ఓ చిన్నారిపై కొందరు కామాంధుల సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అంటే ఏంటి అత్తా అని అడిగిన ఓ చిన్నారిపై రెండు రోజుల తర్వాత కొందరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ నెల 22వ తేదీన అస్సాం రాష్ట్రంలోని నాగావ్ జిల్లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కోల్‌కతా మెడికో అత్యాచారం, హత్య కేసుకు సంబంధించిన వార్తలను రోజూ చూస్తున్న ఓ బాలిక... అసలు అత్యాచారం అంటే ఏంటని తన అత్తను ప్రశ్నించింది. ఆ తర్వాత రెండు రోజులకే 22వ తేదీన ట్యూషన్‌ నుంచి ఇంటికొస్తున్న బాలికను అడ్డగించిన కొందరు యువకులు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక అపస్మారకస్థితిలోకి జారుకుంది. మేనత్త ఇంట్లో ఉంటున్న బాలిక సాధారణంగా రిక్షాలో లేదా అత్తయ్యతో కలిసిగానీ ట్యూషన్‌కు వెళ్లి వస్తుంది. ఈ ఘటన జరిగిన రోజు మాత్రం ఆ బాలిక ఒంటరిగా సైకిల్‌పై ట్యూషన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. 
 
ఈ ఘటన తనను షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నారు. ఆమెను కాపాడుకోవడంలో తాను విఫలమయ్యాయని బోరున విలపిస్తుంది. బాలికకు డీఎస్పీ కావాలని కోరికగా ఉండేదని, ఒకసారి డీఎస్పీని కలిసి మాట్లాడిందని గుర్తు చేసింది. కాగా, ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాధిత బాలికకు న్యాయం చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడైన తఫాజుల్ ఇస్లాం పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చెరువులో దూకి ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలేజీ స్టూడెంట్‌పై ఆటో డ్రైవర్ అత్యాచారం.. మత్తుమందు కలిపిన నీటిని?