Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ డ్రగ్స్ వేధింపులు భరించలేక యువ నటి ఆత్మహత్య... ఎక్కడ?

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (08:49 IST)
ఓ యువనటి బలవన్మరణానికి పాల్పడింది. డ్రగ్స్ కేసులో పేరు వెల్లడించకుండా ఉండాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ, పదేపదే వేధించడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఇలా వేధింపులకు పాల్పడింది నకిలీ అధికారులు కావడం గమనార్హం. ఈ దారుణం ముంబైలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 28 యేళ్ళ బాధిత నటి ఈ నెల 20వ తేదీన ఓ నక్షత్ర హోటల్‌లో పార్టీకి వెళ్లింది. అక్కడామెను కలిసిన ఇద్దరు వ్యక్తులు తాము నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి) అధికారులమని తమను తాము పరిచయం చేసుకున్నారు. అయితే, డ్రగ్స్ కేసులో పేరు బయటపెట్టకుండా ఉండాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. 
 
ఆ తర్వాత పదేపదే ఆమెకు ఫోన్ చేస్తూ వేధించసాగాడు, పైగా, డబ్బులు ఇవ్వకుంటే పేరు లీక్ చేస్తామంటూ బెదిరించారు. వారి వేధింపులను భరించలేని ఆమె గురువారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను వేధించిన మోహన్ పర్దేశి (38), ప్రవీణ్ కుమార్ వలింటే (35)అనే ఇద్దరిని అరెస్టు చేశారు. వీరివద్ద పోలీసులు జరిపిన విచారణలో వీరిద్దరూ నకిలీ ఎన్సీబీ అధికారులని తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments