Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో నీచాతి నీచం .. ఏడాదిన్నర బాలిక మృతదేహంపై అత్యాచారం..

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (15:21 IST)
గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్ర నగర్‌లోని తంగర ప్రాంతంలో ఒక నీచాతి నీచమైన ఘటన జరిగింది. యేడాదిన్నర వయస్సుండే ఓ బాలిక మృతదేహాపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే,
 
తంగర్ ప్రాంతానికి చెందిన యేడాదిన్నర బాలిక గుండెలో రంధ్రం ఉండటంతో చికిత్స పొందుతూ ఈ నెల 25వ తేదీన మృతిచెందింది. అదే రోజు చిన్నారి మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. అయితే, మరుసటి రోజు రోజు కర్మక్రతువులు చేసేందుకు మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలానికి బంధువులు వెళ్లి చూడగా, అక్కడి దృశ్యాన్ని చూసి వారు చలించిపోయారు. 
 
బాలిక మృతదేహం మట్టిపై పడివుంది. బాలిక శరీరంపై నూలు పోగు కూడా లేదు. దీంతో బంధువులు మృతదేహంపై అత్యాచారం జరిగిందన్న అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి వచ్చిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శవపరీక్ష రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలావుంటే, ఇంత నీచానికి దిగజారిన కామాంధుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments