Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూవింగ్ కారులో దళిత బాలికపై సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 24 జనవరి 2023 (08:57 IST)
పాటియాలాలో ఓ దళిత మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. తమ గ్రామంలో పెళ్లి ఊరేగింపు వేడుకను చూస్తున్న ఓ మైనర్ బాలికను ఇద్దరు వ్యక్తులు బలవంతంగా కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత కారులోనే ఆ బాలికను చెరబట్టి అత్యాచారం చేశారు. ఈ దారుణం పాటియాలాకు సమీపంలోని బల్బేడా గ్రామంలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. పెళ్లి వేడుకల్లో భాగంగా, జాగో సంప్రదాయ ఊరేగింపును తిలకిస్తున్న బాలికను ఇద్దరు వ్యక్తులు బలంవంతంగా కారులు ఎక్కించుకుని, ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. దీనిపై ఐపీసీ, ఫోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. 
 
ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నిందితులిద్దరూ అదే గ్రామానికి చెందిన 30 యేళ్ళ వ్యక్తులు. వీరిద్దరికీ వివాహమై భార్యలు ఉన్నారు. వీరిని పాటియాలా కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. బాలికను వైద్య పరీక్షల కోసం పాటియాలాలోని రాజేంద్ర హాస్పిటల్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments