Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్ ప్రదేశ్‌లో కీచక టీచర్ : 24 మంది బాలికలకు లైంగిక వేధింపులు

ఠాగూర్
సోమవారం, 23 జూన్ 2025 (14:46 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిర్మౌర్ జిల్లాలో జరిగిన ఓ దారుణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు వేధింపులకు దిగాడు. పాఠశాలలో చదువుతున్న 24 మంది బాలికలను లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయుడి అసభ్య చేష్టలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో వాటిని భరించలేని బాలికలకు ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ కామాంధ ఉపాధ్యాయుడుని అరెస్టు చేశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... సిర్మౌర్ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణితం టీచర్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. 8 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 24 మంది బాలికలను లైంగికంగా వేధించాడు. టీచర్ చేష్టలు రోజు రోజుకూ పెరిగిపోతుండటంతో బాధిత బాలికలంతా వెళ్లి ప్రిన్సిపాల్ కాంతాదేవికి ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ ఈ ఫిర్యాదును లైంగిక వేధింపులు నిరోధక విభాగం పోలీసులకు చేరవేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ ఉపాధ్యాయుడుని అరెస్టు చేశారు. 
 
దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు... సదరు కీచక ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టిన తర్వాత వేధింపులు నిజమని తేలడంతో ఉపాధ్యాయుడుపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. మరోవైపు, ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చి సదరు టీచర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేయగా, వారికి పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం