Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు వికలాంగ కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి.. ఎక్కడ?

ఠాగూర్
శనివారం, 28 సెప్టెంబరు 2024 (13:37 IST)
వికలాంగులు అయిన తన నలుగురు కుమార్తెలతో కలిసి ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఢిల్లీలో జరిగింది. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగువారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి ఇంటి తలుపులు తెరవగా ఈ విషయం బయటపడింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి దివ్యాంగులైన తన నలుగురు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగపురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వారందరూ విషం సేవించి ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంటి నుంచి దుర్వాస రావడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. 
 
దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్ధలుకొట్టి లోపలికి వెళ్లి చూసి షాకయ్యారు. ఐదుగురి మృతదేహాలు ఒకదాని పక్కన ఒకటి పడివున్నాయి. మూడు రోజుల క్రితమే వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. 
 
ఇంటి పెద్ద వయసు 50 యేళ్ళుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. వసంత్ కుంజ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అతడు కార్పెంటర్‌గా పనిచేస్తూ రంగపురి గ్రామంలో ఉంటున్నారు. ఆ కుటుంబం బీహార్ రాష్ట్రంలోని చాప్రా నుంచి ఢిల్లీకి వలస వచ్చింది. పిల్లల తల్లి కొన్నేళ్ల క్రితమే కేన్సర్‌తో ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments