Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌కు టోకరా వేసిన వ్యక్తి అరెస్టు

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (09:58 IST)
ఢిల్లీలోని నక్షత్ర హోటల్ లీలా ప్యాలెస్‌ హోటల్‌కు టోకరా వేసిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిందితుడుని దక్షిణ కన్నడకు చెందిన మహమ్మద్ షరీఫ్‌గా గుర్తించారు. నకిలీ గుర్తింపు కార్డుతో మూడు నెలల పాటు హోటల్‌లో బస చేసి, ఆ తర్వాత బిల్లు చెల్లించకుండా పారిపోయాడు. చివరకు హోటల్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మోసగాడిని అరెస్టు చేశారు. 
 
దక్షిణ కన్నడకు చెందిన మహమ్మద్ షరీఫ్ (41) అనే వ్యక్తి తాను ప్రభుత్వ ఉద్యోగినని చెప్పి ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌ సిబ్బందికి తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించాడు. నకిలీ బిజినెస్ కార్డును చూపించి మూడు నెలల పాటు హోటల్‌లోనే ఉన్నాడు. దీంతో అతని మొత్తం బిల్లు రూ.23,46,413కు చేరుకుంది. 
 
ఆ తర్వాత బిల్లును చెల్లించకుండా హోటల్‌కు చెందిన విలువైన వస్తువులతో పారిపోయాడు. దీనిపై హోటల్ సిబ్బంది ఈ నెల 14వ తేదీన ఢిల్లీ సరోజిని నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... వెంటనే రంగంలోకి దిగి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments