Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ ఘోరం... రోడ్డు దాటుతున్న పాదాచారులపైకి దూసుకెళ్లిన డంపర్...

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (09:40 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్‌లో దారుణం జరిగింది. రోడ్డు దాటుతున్న వారిపైకి ఓ డంపర్ (ట్రక్కు) దూసుకెళ్లింది. ఆ తర్వాత రోడ్డు పక్కనే ఉన్న మారుతీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
వేగంగా దూసుకొచ్చిన ఓ డంపర్ రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలు సహా ఓ యువకుడిపై దూసుకెళ్లింది. అనంతరం రోడ్డు పక్కనే ఆగివున్న మారుతీ కారును ఢీకొట్టి కొంతదూరం లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో రోడ్డు దాటుతున్న ముగ్గురు పాదాచారాలు, మారుతి కారులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు మరణించారు.
 
దీంతో స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి కాన్పూర్ - లక్నో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతులను శకుంతల, శివానీలుగా గుర్తించారు. అలాగే, కారులో చనిపోయిన వారిని విమలేశ్ కుమార్, శశాంక్‌, పూరణ్ దీక్షిత్‌, మరో వ్యక్తిగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments