Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ ఘోరం... రోడ్డు దాటుతున్న పాదాచారులపైకి దూసుకెళ్లిన డంపర్...

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (09:40 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్‌లో దారుణం జరిగింది. రోడ్డు దాటుతున్న వారిపైకి ఓ డంపర్ (ట్రక్కు) దూసుకెళ్లింది. ఆ తర్వాత రోడ్డు పక్కనే ఉన్న మారుతీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
వేగంగా దూసుకొచ్చిన ఓ డంపర్ రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలు సహా ఓ యువకుడిపై దూసుకెళ్లింది. అనంతరం రోడ్డు పక్కనే ఆగివున్న మారుతీ కారును ఢీకొట్టి కొంతదూరం లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో రోడ్డు దాటుతున్న ముగ్గురు పాదాచారాలు, మారుతి కారులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు మరణించారు.
 
దీంతో స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి కాన్పూర్ - లక్నో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతులను శకుంతల, శివానీలుగా గుర్తించారు. అలాగే, కారులో చనిపోయిన వారిని విమలేశ్ కుమార్, శశాంక్‌, పూరణ్ దీక్షిత్‌, మరో వ్యక్తిగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments