Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో దారుణం.. తలలేదు.. ఒంటిపై నూలుపోగు లేదు..

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (12:21 IST)
మహారాష్ట్రలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, మథేరన్‌లో గోరేగావ్‌కు చెందిన ఓ మహిళ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. వీకెండ్‌లో మథేరన్‌కు చాలామంది టూరిస్టులు వస్తుంటారు. 
 
శని, ఆది వారాలు మథేరన్‌ పర్యాటకులతో సందడిగా ఉంటుంది. అలాంటిది.. గత ఆదివారం మహిళ శవం, అదీ తల లేని మృతదేహం కనిపించడంతో అందరూ భయాందోళనలకు లోనయ్యారు.
 
మథేరన్‌లోని లాడ్జిలో మహిళ మృతదేహం కనిపించింది. మథేరన్ రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న లాడ్జిలో ఈ ఘటన జరిగింది. మహిళ తల కనిపించలేదు. అంతేకాదు.. ఒంటిపై నూలుపోగు లేని స్థితిలో ఆ మహిళ మృతదేహం కనిపించడం శోచనీయం. ఈ కేసును విచారించిన పోలీసులు ఆ మృతదేహం పూనమ్ పాల్‌ అనే మహిళ అని తేల్చారు. కత్తితో ఆమె తలను కోసి దారుణంగా హత్య చేశాడు నిందితుడు.
 
పోలీసులు లాడ్జిలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా పూనమ్ పాల్, ఆమెతో పాటు వచ్చిన వ్యక్తి మాస్క్‌ పెట్టుకుని కనిపించారు. లాడ్జి సిబ్బంది ఆధార్ గానీ, ఎలాంటి ఐడెంటిటీ కార్డు అడగకుండానే రూం ఇవ్వడంతో హంతకుడిని గుర్తించడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది.
 
ఎట్టకేలకు పోలీసులు ఓ హ్యాండ్‌బ్యాగ్‌ను గుర్తించారు. ఇంకా పూనమ్ పాల్ కనిపించకుండా పోయిందని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments