Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

ఐవీఆర్
మంగళవారం, 13 మే 2025 (16:02 IST)
దేశంలో సంచలనం సృష్టించింది తమిళనాడులోని పొల్లాచి లైంగిక వేధింపుల కేసు. ఈ కేసుకు సంబంధించి 9 మందిని దోషులుగా నిర్ణయిస్తూ కోయంబత్తూరు మహిళా కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డ 9 మంది పురుషులకు బ్రతికున్నంతవరకూ జైలుశిక్షను విధించింది. వీరి బారిన పడ్డ మహిళలకు రూ. 85 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. 
 
ఈ కేసుకు సంబంధించి వివరాలను చూస్తే... సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలతో పరిచయాలు పెంచుకుని ప్రేమిస్తున్నానంటూ వారిపై అత్యాచారాలు చేసేవారు. ఆ తర్వాత లైంగిక దాడి చేస్తూ వీడియోలు తీసి వాటిని చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేసేవారు. ఎవరికైనా నిజం చెబితే వీడియోలను ఇంటర్నెట్లో అప్ లోడ్ చేస్తామంటూ బెదిరింపులకు దిగేది ఆ ముఠా. ఈ ముఠాలో శబరిరాజన్, తిరునావుక్కరసు, సతీష్, వసంత్ కుమార్, మణివణ్ణన్, బాబు, పాల్, అరుళానందం దోషులుగా తేలారు.
 
2019లో బాధిత మహిళలు ఫిర్యాదుతో వీరి అఘాయిత్యాలు బైటపడ్డాయి. వందలాదిమంది అమ్మాయిలపై లైంగిక దాడులకు పాల్పడ్డట్టు విచారణలో తేలింది. సీబీఐ దర్యాప్తులో 9 మందిపై కుట్ర, లైంగిక వేధింపులు, అత్యాచారం, సామూహిక అత్యాచారం, పదేపదే అత్యాచారం వంటి అభియోగాలు నమోదయ్యాయి. కేసులో వాదోపవాదాలు విన్న కోర్టు వీరిని దోషులకు తేల్చి శిక్ష విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి సభ్యులందరికీ, కార్మికులకూ మంచి జరగాలి : మాదాలరవి

చిత్రపురి కాలనీ రియల్ ఎస్టేట్ గా మారింది : కస్తూరిశీను, మద్దినేని రమేష్

రామ్ పోతినేని 22 చిత్రంలో సూర్య కుమార్‌గా ఉపేంద్ర పరిచయం

Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరిత్ర సృష్టించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం