Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను ప్రియుడు గట్టిగా పట్టుకుంటే భార్య అతడి కడుపులో పొడిచింది

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (10:25 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడన్న అక్కసుతో ఓ మహిళ కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేయించింది. తన ప్రియుడిని ఇంటికి పిలిపించి ఈ దారుణానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ మల్లేపల్లికి చెందిన దంపతులకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. అతడి భార్యకు బీదర్‌ ప్రాంతానికి చెందిన కాంబ్లె యువరాజ్‌(35)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయంలో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. 
 
ఈ క్రమంలో గత ఆదివారం దంపతులిద్దరి మధ్యలో ఇదేవిషయంలో గొడవ జరిగింది. గొడవ పెరగడంతో ఆమె ప్రియుడిని ఇంటికి పిలిచింది. మద్యం మత్తులో ఉన్న భర్త చేతులను కాంబ్లే వెనక్కి విరిచి పట్టుకుంటే.. భార్య కత్తితో కడుపులో పొడిచింది. ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు చనిపోయాడు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments