Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను ప్రియుడు గట్టిగా పట్టుకుంటే భార్య అతడి కడుపులో పొడిచింది

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (10:25 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడన్న అక్కసుతో ఓ మహిళ కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేయించింది. తన ప్రియుడిని ఇంటికి పిలిపించి ఈ దారుణానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ మల్లేపల్లికి చెందిన దంపతులకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. అతడి భార్యకు బీదర్‌ ప్రాంతానికి చెందిన కాంబ్లె యువరాజ్‌(35)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయంలో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. 
 
ఈ క్రమంలో గత ఆదివారం దంపతులిద్దరి మధ్యలో ఇదేవిషయంలో గొడవ జరిగింది. గొడవ పెరగడంతో ఆమె ప్రియుడిని ఇంటికి పిలిచింది. మద్యం మత్తులో ఉన్న భర్త చేతులను కాంబ్లే వెనక్కి విరిచి పట్టుకుంటే.. భార్య కత్తితో కడుపులో పొడిచింది. ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు చనిపోయాడు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments