Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె తల వేరు చేసి పెద్దమ్మ గుడి ముందు పెట్టివచ్చా, పోలీసుల ముందు కత్తితో నిందితుడు (video)

ఐవీఆర్
మంగళవారం, 27 మే 2025 (16:17 IST)
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యంత భీతావహ హత్య జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ రాక్షస యువకుడు ఓ మహిళ తల నరికేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషను వద్దకు వచ్చి లొంగిపోయాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండల కేంద్రంలో ఓ మహిళ పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళుతోంది. ఆ సమయంలో ఎక్కడ నుంచి వచ్చాడో తెలియదు కానీ యముడులా ఆమెపై కత్తితో దాడి చేసాడు. తల నరికేశాడు.
 
అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపే మహిళ తలను వేరు చేసి చంపేసాడు. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషను వెళ్లాడు. పెద్దమ్మ గుడి ఎదురుగా ఓ మహిళను చంపేసాను. ఆమె తలను వేరు చేసా, ఆమె చచ్చిపోయింది అంటూ తన చేతిలోని కత్తిని పోలీసుల ముందు పెట్టేసాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
 
ఈ నిందితుడు గతంలో కూడా వినాయక చవితి రోజున ఓ వ్యక్తిని హత్య చేసినట్లు తేలింది. మరి హత్య చేసిన వ్యక్తి ఇలా బయట ఎలా తిరుగుతున్నాడన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా మహిళ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ajay Devgn : నేను డ్యాన్స్‌ని యాక్షన్‌గా చూస్తా : జాకీ చాన్

ఆదర్శవంతమైన పాలకులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయిక : నారా రోహిత్

ప్రభుత్వానికి వారధి ఫిలింఛాంబర్ మాత్రమే - త్వరలో కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీ : పవన్ కళ్యాణ్

అతీంద్రియ శక్తుల గల శంబాల లో బాలుగా శివకార్తీక్

హింసకన్నా విలువలతో కూడిన షష్టిపూర్తి నచ్చి హేమాహేమీలు పనిచేశారు: హీరో, నిర్మాత రూపేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments