Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరు సెంట్ల భూమి కోసం కన్నతండ్రిని కడతేర్చిన కసాయి కొడుకు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2023 (16:15 IST)
ఆరు సెంట్ల భూమి కోసం ఓ కసాయి కొడుకు కన్నతండ్రిని కడతేర్చాడు. 50 యేళ్ల వయసులో ఉన్న తండ్రిని అతి కిరాతకంగా చంపేశాడు. కన్నతండ్రిపై క్రూరంగా డీజిల్ పోసి నిప్పు అంటించాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన ఏపీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కృష్ణా జిల్లాలోని అవనిగడ్డకు సమీపంలోని నాగాయలంక మండలం బవదేరపల్లికి చెందిన హరి మోహన్ అనే వ్యక్తికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేశాడు. ఆయన భార్య కొన్ని నెలల క్రితం మంచానపడింది. ఈ క్రమంలో కొడుకు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీన్ని తండ్రి హరిమోహన్ పలుమార్లు మందలించాడు. దీంతో కసిపెంచుకోవడంతో పాటు తన తండ్రి పేరిట ఉన్న ఆరు సెంట్ల భూమిపై కన్నేశాడు. ఆ భూమి విక్రయించి డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తుండటంతో తండ్రీకుమారుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 
 
ఈ క్రమంలో శనివారం రాత్రి ఇదే విషయంపై తండ్రితో గొడవపడిన తలపై బలంగా కొట్టాడు. దీంతో హరిమోహన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. ఆపై ఇంట్లోనే తండ్రి మృతదేహంపై డీజిల్ పోసి నిప్పంటించాడు. ఇంట్లో నుంచి పొగ బయటకు రావడంతో గమనించిన ఇరుగు పొరుగువారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments