Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరు సెంట్ల భూమి కోసం కన్నతండ్రిని కడతేర్చిన కసాయి కొడుకు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2023 (16:15 IST)
ఆరు సెంట్ల భూమి కోసం ఓ కసాయి కొడుకు కన్నతండ్రిని కడతేర్చాడు. 50 యేళ్ల వయసులో ఉన్న తండ్రిని అతి కిరాతకంగా చంపేశాడు. కన్నతండ్రిపై క్రూరంగా డీజిల్ పోసి నిప్పు అంటించాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన ఏపీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కృష్ణా జిల్లాలోని అవనిగడ్డకు సమీపంలోని నాగాయలంక మండలం బవదేరపల్లికి చెందిన హరి మోహన్ అనే వ్యక్తికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేశాడు. ఆయన భార్య కొన్ని నెలల క్రితం మంచానపడింది. ఈ క్రమంలో కొడుకు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీన్ని తండ్రి హరిమోహన్ పలుమార్లు మందలించాడు. దీంతో కసిపెంచుకోవడంతో పాటు తన తండ్రి పేరిట ఉన్న ఆరు సెంట్ల భూమిపై కన్నేశాడు. ఆ భూమి విక్రయించి డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తుండటంతో తండ్రీకుమారుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 
 
ఈ క్రమంలో శనివారం రాత్రి ఇదే విషయంపై తండ్రితో గొడవపడిన తలపై బలంగా కొట్టాడు. దీంతో హరిమోహన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. ఆపై ఇంట్లోనే తండ్రి మృతదేహంపై డీజిల్ పోసి నిప్పంటించాడు. ఇంట్లో నుంచి పొగ బయటకు రావడంతో గమనించిన ఇరుగు పొరుగువారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments