Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోనే కూతురిని పూడ్చి పెట్టిన కన్నతల్లి.. తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి...

వరుణ్
సోమవారం, 24 జూన్ 2024 (15:57 IST)
దేశ రాజధాని ఢిల్లీలోని ఫరీదాబాద్‌‍లో దారుణం జరిగింది. భార్యా భర్తల వివాదం కారణంగా ఓ అభంశుభం తెలియని ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సొంత కుమార్తెను హత్య చేసిన తల్లి మృతదేహాన్ని కూడా ఇంట్లోనే పాతిపెట్టింది. ఈ విషయం మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్యతో విభేదాల నేపథ్యంలో దాదాపు 10 నెలలుగా కన్నకూతురి జాడ తెలియకపోవడంతో ఓ తండ్రికి అనుమానం వచ్చింది. సౌదీ అరేబియాలో ఉంటున్న అతడు అక్కడి నుంచే ఈ-మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు తమ దర్యాప్తులో ఆ వ్యక్తి కూతురు చనిపోయిందని గుర్తించారు. సొంత ఇంట్లోనే ఆమెను పాతిపెట్టారని కనుగొన్నారు. పాతి పెట్టింది కూడా కన్నతల్లేనని తేల్చాడు. ఈ షాకింగ్ ఘటన దేశ రాజధాని ఢిల్లీకి అనుకొని ఉండే ఫరీదాబాద్‌లో వెలుగులో చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మృతురాలి పేరు ఫర్వీనా. ఆమె 17 ఏళ్లని పోలీసులు వెల్లడించారు. తల్లి అనితా బేగంను అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు. జూన్ 7న తమకు ఈ-మెయిల్ ఫిర్యాదు వచ్చిందని, ఇంత ఆలస్యంగా ఫిర్యాదు చేయడంపై ప్రశ్నించగా తన భార్యతో సత్సంబంధాలు లేవని అతడు చెప్పాడని వివరించారు.
 
కాగా ఫర్వీనాను తాను హత్య చేయలేదని తల్లి అనితా బేగం చెబుతోంది. ఫర్వీనా ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు చెప్పింది. అయితే ఇంట్లో పాతిపెట్టింది తానేనని ఆమె అంగీకరించింది. ఫర్వీనాకు ఇతరులతో సంబంధాలు ఉండేవని, ఇంటి నుంచి పారిపోతుండేదని, ఎటూ వెళ్లకుండా ఇంట్లోనే ఉంచానని, ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని పేర్కొంది. 
 
ఇక కుటుంబానికి చెడ్డపేరు వస్తుందనే భయంతో ఇద్దరు వ్యక్తుల సహాయంతో ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు వివరించింది. చెడ్డ పేరు వస్తుందనే భయంతో ఆమెను ఇంట్లోనే పాతిపెట్టడం తాను చేసిన పెద్ద తప్పు అని అనితా బేగం అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. అయితే, పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక తదుపరి విచారణ మొదలు పెడతామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments