Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తండ్రి దుబాయ్‌లో... ప్రియుడితో తల్లి రాసలీలలు.. కళ్లారా చూసిన కుమార్తెను..?

woman

సెల్వి

, గురువారం, 23 మే 2024 (12:14 IST)
తమిళనాడు మధురైలో ఘోరం జరిగింది. ప్రియుడితో ఉల్లాసంగా వుండిన తల్లిని కుమార్తె చూసేసింది. దీంతో కన్నకూతురితో ఆ తల్లి దారుణంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళితే.. మధురై, మేలూరుకు సమీపంలోని ఉలగనాథపురంకు చెందిన సమయముత్తుకు మలర్ సెల్వి అనే మహిళతో వివాహమై ఏడేళ్లు కుమారుడు, ఐదేళ్ల కుమార్తె వున్నారు. సమయముత్తు ప్రస్తుతం దుబాయ్‌లో వున్నాడు. ఈ నేపథ్యంలో మలర్ సెల్వి ఆ ప్రాంతానికి చెందిన ధర్మసుందర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. 
 
ఈ సంబంధం కారణంగా వీరిద్దరూ శారీరకంగా కలిసేవారు. ఇలా తల్లి ప్రియుడుతో ఓసారి ఉల్లాసంగా వుండిన తతంగాన్ని కన్నకూతురు కళ్లారా చూసేసింది. ఈ విషయాన్ని కుమార్తె బయట చెప్పేస్తుందనే భయంతో తన ప్రియుడితో కలిసి చిన్నారి కార్తీకను బావిలో పడేసి హత్య చేసింది. ఆపై చిన్నారి కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు నిజాలను నిగ్గు తేల్చారు. కన్నబిడ్డను ప్రియుడితో కలిసి చంపేసినట్లు ఒప్పుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మలర్ సెల్విని, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు... సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు వార్నింగ్