Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు కోరే కుమార్తెలకు ఆ బాధ్యత కూడా ఉంటుంది : ఇండోర్ కోర్టు

court

ఠాగూర్

, బుధవారం, 22 మే 2024 (12:16 IST)
తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు కోరే కుమార్తెలకు వృద్ధాప్యంలో కన్నతల్లి ఆలనాపానలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుందని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ కోర్టు స్పష్టం చేసింది. వయో వృద్ధురాలైన కన్నతల్లికి జీవన వ్యయం కింద భరణం చెల్లించాలని కోర్టు కుమార్తెను ఆదేశించింది. ఈ మేరకు కోర్టు అదనపు ప్రిన్సిపల్ జడ్జి మాయా విశ్వలాల్ తీర్పును వెలువరించారు. 
 
78 ఏళ్ల తల్లికి 55 ఏళ్ల కూతురు ఏకైక సంతానం. కొవిడ్ విజృంభణ సమయంలో ఇంటి నుంచి కుమార్తె తరిమివేయడంతో ఆ వృద్ధురాలు కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేసిన పిటిషనర్ భర్త 2001లో మరణించారు. ఆ తర్వాత తల్లిని తన ఇంట్లో ఉండాల్సిందిగా కుమార్తె ఆహ్వానించింది. 
 
ఆమెతో వారసత్వ ఆస్తి అయిన ఇంటిని విక్రయించేలా చేసింది. తండ్రి భవిష్య నిధి ఖాతాలోని డబ్బునూ తీసుకుంది. 2020 మార్చిలో కొవిడ్ వల్ల ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు తల్లిని చిత్రహింసలు పెట్టి ఇంట్లో నుంచి తరిమేసింది. కుమార్తె చీరల దుకాణం నడుపుతూ నెలకు రూ.22,000 వరకు వృద్ధురాలు పేర్కొంది. దాంతో తల్లిని పోషించగల స్తోమత కుమార్తెకు ఉందని, అందువల్ల ఆమె అర్జిస్తున్న ఆదాయంలో నెలకు రూ.3 వేలు చొప్పున భరణం చెల్లించాలని కుమార్తెను ఆదేశించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీ వ్యాపారికి రూ.49 కోట్ల ఐటీ నోటీసు