Webdunia - Bharat's app for daily news and videos

Install App

చపాతీ కోసం రిక్షాకార్మికుడి హత్య.. ఎక్కడ?

Webdunia
గురువారం, 28 జులై 2022 (09:36 IST)
ఓ తాగుబోతు ఒక చపాతీ కోసం రిక్షా కార్మికుడిని హత్య చేశాడు. ఈ దారుణం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 26వ తేదీ రాత్రి పది గంటల సమయంలో మున్నా (40) అనే రిక్షా కార్మికుడు మరో వ్యక్తితో కలిసి ఢిల్లీలోని కారోల్‌ బాఘ్‌లో చపాతీ తింటున్నాడు. ఇంతలో అక్కడకు ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి వచ్చాడు. 
 
ఫిరోజ్ ఖాన్ అప్పటికే పీకల వరకు మద్యం సేవించడంతో మద్యం మత్తులో ఉన్నాడు. దీంతో మున్నాను ఓ చపాతీ అడిగాడు. అతను ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో మున్నాతో ఫిరోజ్ ఖాన్ వాగ్వాదానికి దిగి ఘర్షణ పడ్డాడు.
 
దీంతో రిక్షా కార్మికుడు కూడా ఎదురు తిరగడంతో కోపోద్రిక్తుడైన ఫిరోజ్ ఖాన్.. తన వద్ద ఉన్న పదునైన కత్తితో మున్నాను పొడిచి చంపేశాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న మరో వ్యక్తి మున్నాను పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతను చిక్కకుండా పారిపోయాడు. ఆ తర్వాత మరికొందరి సాయంతో మున్నాను ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసి పరారైన ఫిరోజ్ ఖాన్‌‍ను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments